హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : మాజీ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుడు, ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్మెంట్ జాతీయ కన్వీనర్ కృష్ణప్రసాద్ భౌతికకాయానికి గురువారం సీపీఐ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్లో కృష్ణప్రసాద్ మరణించారు. మరణవార్త విన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీనియర్ నేత నారాయణ, మాజీ ఎంపీ అజీజ్పాషా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బోస్, రవీంద్రాచారి, ఛాయాదేవి, విజయలక్ష్మి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, శ్రీకాంత్ నివాలళులర్పించారు.