హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీది బూటకపు ప్రేమ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రైవేటీకరించే చర్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఫ్యాక్టరీ యంత్ర సామగ్రిని తుక్కుగా అ మ్మేందుకు టెండర్లు పి లవడాన్ని ఖండించారు. సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చేందుకు ముందుకొచ్చినా, కేంద్రం పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించి.. వెనుకబడిన ఆదివాసీలు ఉన్న ఈ జి ల్లాలో ఉద్యోగాల కల్పనకు, అభివృద్ధికి బాటలు వేయకపోవడం అన్యాయమన్నారు. ఆదిలాబా ద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీని గెలిపించిన ప్రజలపై కేంద్రం కక్షగట్టడం దారుణమన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ సామగ్రి వేలం ప్రక్రియను నిలిపి వేయించి, పరిశ్రమను పునరుద్ధరించాలని చాడ డిమాండ్ చేశారు.