హైదరాబాద్ : పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఆగస్ట్ 11 నుంచి 22 వరకు సీపీగెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) జూన్లో నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ విడుదల చేసింది. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జేఎన్టీయూ హెచ్, మహిళా వర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్ష కోసం ఈ నెల 4 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.