CPGET 2022 | రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ – 2022 ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయని చెప్పారు. ఈ పరీక్షలను గత నెల 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించామని గుర్తు చేశారు. మొత్తం 67,027 మంది దరఖాస్తు చేసుకోగా, 57,262 మంది హాజరయ్యారని చెప్పారు.