హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) వెబ్ కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఓయూ అధికారులు మంగళవారం ప్రకటించారు. 28 నుంచి రిజిస్ట్రేషన్లు, అక్టోబర్ 12 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 18న సీట్లను కేటాయిస్తారు. అక్టోబర్ 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నది.
8 వర్సిటీల్లో 44వేల సీట్లు..
రాష్ట్రంలోని 8 వర్సిటీల పరిధిలో 320 కాలేజీలున్నాయి. వీటిల్లో మొత్తం 44,871 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ మహిళా వర్సిటీలో 514 పీజీ సీట్లున్నాయి. అత్యధికంగా ఓయూలో 14వేలకు పైగా సీట్లు, కాకతీయలో 11వేలకు పైగా సీట్లున్నాయి. మొత్తం 45 కోర్సులుండగా, ఎంకాంలో అత్యధికంగా 9,252 సీట్లున్నాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 4,280, ఎమ్మెస్సీ మ్యాథ్స్లో 4,944, ఎంఏ ఇంగ్లిష్లో 2,538, ఎంఏ తెలుగులో 2,750, ఎంఏ ఫిజిక్స్లో 2,039 సీట్లున్నాయి.