హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నూతన గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త గవర్నర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు షబ్బీర్ అలీ, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రులు గ్రూప్ఫొటో దిగారు.
గుట్ట పునర్నిర్మాణం అద్భుతం
వెయ్యేండ్ల కన్నా పురాతనమైన యాదగిరి గుట్ట ఆలయాన్ని పూర్తిగా రాతిశిల్పంతో పునర్నిర్మించడం అద్భుతమని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కితాబునిచ్చారు. బుధవారం ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నారు. కొండపైన ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కే జెండగే, ఈవో భాస్కర్ రావు ఘనస్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం చేయగా
ఆలయాధికారులు మహాప్రసాదంతోపాటు స్వామి చిత్రపటాన్ని అందచేశారు. ఆలయంలోకి రాగానే భక్తిభావం ఉప్పొంగిందని మీడియాతో గవర్నర్ అన్నారు.