పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 28: రోడ్డు ప్రమాదంలో 13 గోవులు మృతి చెందాయి. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్లోని కబేలాల కోసం డీసీఎంలో 51 పశువులను తరలిస్తున్నారు.
పాలకుర్తి మండలం వావిలాల మూల మలుపు వద్దకు రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంతో డీసీఎం అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ఉన్న 13 గోవులు అక్కడికక్కడే మృతి చెం దగా.. మరో 13 గాయపడ్డాయి. పశు వైద్యాధికారి అశోక్రెడ్డి వాటికి వైద్య పరీక్షలు చేశారు.
మిగిలిన 25 ఆవులను పోలీసులు గోశాలకు తరలించారు. డీసీఎం డ్రైవర్ పరారైనట్టు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. డ్రైవర్పై కేసు న మోదు చేసి వాహనాన్ని సీజ్ చేశామని సీఐ వివరించారు. ఘటనా స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య పరిశీలించారు.