హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బార్ కౌన్సిల్కు గత నెల 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెకింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొత్తం 23 మంది బార్ కౌన్సిల్ సభ్యుల పదవులకు పడిన ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో అధికంగా ఓట్లు సాధించిన వాళ్లను ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఈ 23 మందిలో ఐదుగురు మహిళలు ఉంటారు. మొత్తం 203 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా, వీరిలో 55 మంది మహిళా న్యాయవాదులు ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో దాదాపు 41 శాతం చెల్లకుండా పోవడంపై న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడేండ్ల తరువాత ఎన్నికలు జరుగడంతో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు ఓటింగ్లో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలపై న్యాయవాద వర్గాల్లో ఉతంఠ నెలకొన్నది.