హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు స్థానాలకు ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 12 స్థానాలకుగాను.. ఆరు స్థానాలను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ గెలిచిన విషయం తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ 9 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఏడు రౌండ్ల పాటు లెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 12 లేదా ఒంటి గంట వరకు పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. గత శుక్రవారం ఆరు స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కరీంనగర్లో జిల్లాలో రెండు స్థానాలకు 9, ఆదిలాబాద్లో ఆరు, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అయిదేసి టేబుళ్ల చొప్పున కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. తొలుత 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మొదటి ప్రాధాన్యాత ఓటును ముందుగా లెక్కిస్తారు.