హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్, బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానున్నది. రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉదయం కౌన్సెలింగ్ ప్రారం భం కానున్నది.
తొలివిడత కౌన్సెలింగ్ 29వ తేదీ వరకు కొనసాగుతుందని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య మంగళవారం ప్రకటనలో తెలిపారు. వివరాలకు www.pjtau.edu.inలో చూడాలని వర్సిటీ అధికారులు సూచించారు.