హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాలకు 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు మంగళవారం ప్రకటనలో వెల్లడించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ కొనసాగుతుందని తెలిపారు. వివరాలకు https://www.pjtau.edu.in, https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్సైట్ను చూడాలని సూచించారు.