హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కౌన్సిల్ ఆఫ్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషనన్స్ (సీఐఎస్సీఈ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్లోని హబ్సిగూడ రవీంద్రనగర్లో ఏర్పాటైంది. అటానమస్ నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు అయిన దీనిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారు.
ఈ బోర్డు కింద జాతీయంగా 2,750 స్కూళ్లు ఉన్నాయి. ఈ సంస్థకు న్యూఢిల్లీ, నోయిడా, కోల్కత్తాల్లోనూ కార్యాలయాలు ఉన్నాయి. ఈ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన స్కూళ్లలో అమలుచేస్తున్న కరికులంపై నిపుణులకు, టీచర్లకు శిక్షణ ఇస్తారు.