మంచిర్యాల ఏసీసీ, జూన్ 13: మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సీనియర్ అకౌంటెంట్ సిరికొండ దీపిక, మరో సీనియర్ అకౌంటెంట్ పులి రాజనర్సయ్య, గతంలో ఇక్కడ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన ష ఫీయొద్దీన్.. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ అద్దెకారుకు రూ.లక్షా 96 వేలు బిల్లులు చెల్లించేందుకు రూ.10 వేలు డిమాండ్ చేశారు. రామసాగర్ ఫిర్యాదు మేరకు వారిని మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.