మద్యం మత్తులో హేళనగా మాట్లాడాడని స్నేహితుడిని చంపేశాడు ఓ నిందితుడు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి గురువారం వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లో ఈ నెల 11న రాత్రి శివ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో అతడి స్నేహితుడు డేవిడ్ ఈ హత్య చేసినట్లు మరో స్నేహితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన అనంతరం నిందితుడు డేవిడ్రాజు అక్కడినుంచి పరారవ్వగా బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన డేవిడ్ను స్నేహితుడు శివ తరచూ దూషిస్తుండటంతో పాటు హేళనగా మాట్లాడుతుంటాడు. ఇదే క్రమంలో ఈ నెల 11న రాత్రి హతుడు శివ, డేవిడ్, రాకేశ్, శ్రీనివాస్ అనే నలుగురు వ్యక్తులు ఫుట్పాత్పై మద్యం సేవించారు. అర్ధరాత్రి తర్వాత రాకేశ్, శ్రీనివాస్ అక్కడినుంచి వెళ్లిపోగా శివ, డేవిడ్లు గొడవకు దిగారు. ఈ గొడవలో తనను హేళనగా మాట్లాడటంతో ఆగ్రహానికి లోనయిన డేవిడ్ బండరాయితో శివ తలమీద కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు.