హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 174 కరోనా కేసులు, 2 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో కొత్తగా 202 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4096 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 24 గంటల్లో మొత్తం 38,442 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు చెప్పారు.