హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే గడిచిన 24 గంటల్లో మొత్తం 190 మంది కరోనా బాధితులు కోలుకున్నారని, అలాగే కరోనా కారణంగా ఒకరు మృతి చెందారని తెలిపింది.
రాష్ట్రంలో ప్రస్తుతానికి 3,940 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 46,808 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 202 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.