హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తున్నది. శనివారం 57,942 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 535 మందికి పాజిటివ్గా తేలినట్టు ఆదివారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 154, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 49, రంగారెడ్డిలో 39, నిజామాబాద్లో 32, సంగారెడ్డిలో 22, మహబూబ్నగర్లో 21, యాదాద్రి భువనగిరిలో 19, ఖమ్మం 16, కరీంనగర్, జగిత్యాలలో 15 చొప్పున, ఆదిలాబాద్, నల్లగొండ, నిర్మల్, వరంగల్ అర్బన్లలో 11 చొప్పున కేసులు రికార్డయ్యాయి.
ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా
ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. తాను ఐసొలేషన్లోకి వెళ్లినట్టు తెలిపారు.
ఏపీలో 1,005 కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తున్నది. శనివారం 31,142 నమూనాలను పరీక్షించగా, 1,005 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయా రు. తాజా కేసులతో కలిసిఇప్పటివరకు రాష్ట్రంలో 8,98,815 మంది వైరస్ బారినపడినట్టు వైద్యారోగ్యశాఖ వివరించింది.
ఇవీ కూడా చదవండి
ఫేస్బుక్ కొత్త రిస్ట్బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్..40శాతం డిస్కౌంట్