తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో మొత్తం 203 మంది కరోనా బాధితులు కోలుకోగా.. ఒకరు మరణించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 98.84శాతం రికవరీ రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా 3,782 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ రోజు మొత్తం 39,781 మందికి కరోనా టెస్టులు చేసినట్లు చెప్పారు.