తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 177 కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా ఒకరు మరణించినట్లు వైద్యారోగ్య శాఖ అదికారులు వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. దీనిప్రకారం, రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 190 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,72,637కు చేరింది.
ఈ రోజు మొత్తం 38,219 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 177 మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,596 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. అదే విధంగా ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి రాష్ట్రానికి ఈరోజు మొత్తం 648 మంది వచ్చారు. వారిలో ఆరుగిరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరి శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్కు అధికారులు పంపించారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.