BRAOU | హైదరాబాద్, ఏప్రిల్ 26 : యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం ఆరో రోజు కొనసాగింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రో. పీ. వెంకట రమణ, ప్రో. బి. శ్రీనివాస్, ప్రో. జి దయాకర్, ప్రో. రవీంద్రనాథ్ సోలొమన్, ప్రో. చంద్రకళ, ప్రో. కిశోర్ కుమార్ రెడ్డి మద్దతు పలికి మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు డా. కె. అవినాష్, ప్రధాన కార్యదర్శి డా. ఎం. కిషోర్, సలహాదారులు డా.కె యాదగిరి, డా. కాసం విజయ్, ఉపాధ్యక్షురాలు కె. ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి డా. పి. రాధాకృష్ణ, కోశాధికారి డా. వై. కుమార్, కాంట్రాక్టు అధ్యాపకులు డి. కోటేశ్వర రావు, డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ కుమార్, డా.విజయ ఉషశ్రీ , డి శ్రీవేణి, డా. అరుణ సిద్ధాంతి, డా. కురుమేటి దయాకర్, నర్సయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.