హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫోరం-తెలంగాణ కోరింది. ఆదివారం మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం సమర్పించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రమబద్ధీకరణను వేగవంతం చేయాలని ఫోరం కన్వీనర్ సయ్యద్ జబీ తదితరులు మంత్రికి విజ్ఞప్తిచేశారు.