హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తె లంగాణ): ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర ర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరిం ది. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆన్లైన్లో వినతిపత్రాన్ని సమర్పించినట్టు అసోసియేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, సురేశ్లుతెలిపారు.