హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నాణ్యమైన ఎంసీహెచ్, న్యూట్రిషన్ కిట్స్ లను కొనుగోలు చేసి అనుకున్న సమయానికి సరఫరా చేయాలని ఆదేశించారు.
టీఎస్ఎంఎస్ఐడీసీ ( TSMSIDC ) ద్వారా నిర్మిస్తున్న వైద్య కళాశాల ల బిల్డింగ్ నిర్మాణ పనులు, నర్సింగ్ కాలేజ్ ల (Nursing Colleages) నిర్మాణం, కళాశాలల సామర్థ్యం పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పన, అధునాతన పరికరాల కొనుగోలు తో పాటు మందులు(Medicines), డ్రగ్స్ వాటిపై పలు సూచనలు చేశారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ కణ్ణన్, ఈడీ కౌటిల్య, సీఈ రాజేంద్ర కుమార్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.