వనపర్తి : అవకాశం ఉన్న ప్రతి చోటా ఫ్రీడం పార్కులను నిర్మిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా వనపర్తి లక్ష్మికుంట వద్ద ఫ్రీడం పార్క్ లో విద్యార్థులు, పట్టణవాసులతో పెద్దఎత్తున మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..శ్రీనివాసపురం లక్ష్మికుంట భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతంగా మారబోతున్నది. రూ.కోటిన్నర వెచ్చించి చిన్న కుంటను పెద్ద చెరువుగా మార్చామన్నారు. లక్ష్మికుంట సమీపంలో 35 ఎకరాలలో ఫ్రీడం పార్కు ఏర్పాటు
చేస్తామన్నారు. వనపర్తిలో 11 వేల ఎకరాలలో అటవీ ప్రాంతం ఉందని, అటవీ ప్రాంతాలలో చెరువుల మూలంగా వివిధ రకాల జీవజాతుల పెంపునకు దోహదం పడుతుందన్నారు. సీఎం కేసీఆర్తలపెట్టిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తదితరులు ఉన్నారు.