హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీస్ శాఖలో 7,547 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పురుషులకు 5,056, మహిళలకు 2,491 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు అర్హతలు, ఎంపిక తదితర విషయాలపై ఈ నెల 6న ‘నమస్తే తెలంగాణ’ అనుబంధం ‘నిపుణ’లో చూడండి.