మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అన్ని రంగాలను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ( Congress Party) తెలంగాణకు పట్టిన శనిలా దాపురించిందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ( Dr. C. Laxma Reddy ) ఆరోపించారు. జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జనలో ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేస్తుంది. అంతర్గత కుమ్ములాటలు,వాటాల పంచాయితీతో కాంగ్రెస్ పార్టీ రోడ్డున పడిందని విమర్శించారు. తెలంగాణ సొమ్ము ఢిల్లీకి మూటలు మోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కుప్పకూలింది.. కనీసం మంచినీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతకావడం లేదని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. కేసీఆర్ను తిట్టడానికే రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపడితే పనులు పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టిందని దుయ్యబట్టారు.