హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు అక్కిరెడ్డి సంజీవరెడ్డి, కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం, మదార్సాహెబ్, సోమరాజు, కుడితిపూడి కోటేశ్వర్రావు, బూర నర్సయ్య, గగ్గోలి నర్సయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఈసారి మంచి విజయాలు సాధించబోతున్నదని, అందరూ కలిసికట్టుగా విజయం ఏకపక్షమయ్యేలా పనిచేయాలని సూచించా రు. పినపాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్నదని చెప్పారు.