రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి.. టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరంతా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో వీరంతా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తెలంగాణను అభివృద్ది చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ కు తెలంగాణ ప్రజానికం అండగా నిలిచిందని అయన అన్నారు. దేశంలోనే అత్యధిక క్రీయాశీల సభ్యత్వం కలిగిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సంక్షేమ, అభివృద్ది పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన ప్రతి వారికీ మంచి రాజకీయ భవిష్యతు ఉంటుందని మంత్రి దయాకర్ రావు తెలిపారు. కిష్టపాటి వెంకట్ రెడ్డి, గంగారపు నర్సింహారెడ్డి, వెన్నపూసల పునారెడ్డి, అంబటి నవీన్ రెడ్డి, బాగాల నర్సింహారెడ్డి, పడిగేపాటి చంద్రారెడ్డి, కౌడగాని సిద్దివీరయ్య, మల్ రెడ్డి నవీన్ రెడ్డి, సలగారి రాజు, లింగాల లక్ష్మారెడ్డి, దేవరుప్పుల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాషిపెళ్లి యాకయ్య, మండల సీనియర్ నాయకులు సిందే రాంనర్సయ్య, సర్పంచ్ పులిగిల్ల సుధాకర్, బాసిపెళ్లి కోటయ్య, కాంటూరి సత్యనారాయణ, లొనే మహేందర్, యూత్ అధ్యక్షుడు కాంటూరి ప్రవీణ్, పిట్టల సోమయ్య, పిట్టల యాదయ్య, కౌడగానికవిత ఆంజయ్య తదితరులు పాల్గొన్నారు