నీలగిరి, నవంబర్ 13: తమతోపాటు పార్టీ మారనందుకు కక్ష పెంచుకుని ఓ ముస్లిం కుటుంబాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్ దంపతులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఉద్యోగం ఊడగొట్టించడంతోపాటు ఇంటిపైకి భౌతికదాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లగొండ పట్ట ణం 16వ వార్డు ఆర్జాలబావిలో ఆదివారం జరిగింది. 16వ వార్డు కౌన్సిలర్ జెర్రిపోతుల అశ్వినీభాస్కర్గౌడ్ బీఆర్ఎస్ను వీడి ఇటీవల కాంగ్రెస్ చేరారు. కౌన్సిలర్ వెంట శ్రేణులెవ రూ కాంగ్రెస్లో చేరలేదు. ఇదేక్రమంలో మున్సిపల్ శాఖలో జవాన్గా పనిచేసే వ్యక్తి, అదే వార్డుకు చెందిన షేక్ అన్వర్కు స్థానికంగా మంచి పేరున్నది.
కౌన్సిలర్ దంపతులు అత న్ని కాంగ్రెస్లోకి రావాలని ఒత్తిడి చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తమకేం అన్యాయం చేయలేదని పేర్కొంటూ వారు కాంగ్రెస్లోకి వెళ్లేందుకు నిరాకరించా రు. దీంతో వారు అన్వర్పై కక్ష పెంచుకున్నా రు. సహచర కౌన్సిలర్ సహకారంతో అన్వర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా అన్వర్ దారికి రాకపోవడంతో కౌన్సిలర్ భర్త, ఆయన అనుచరులు అన్వర్ ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు. కాలనీవాసులు ఏకమై కౌన్సిలర్ దంపతులు, అనుచరులను అడ్డుకున్నారు.
విషయం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి వెళ్లిం ది. దీంతో కోమటిరెడ్డి అనుచరులతో కలిసి నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని కౌన్సిలర్పైనే దాడి జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముస్లిం యువకులు, కాంగ్రెస్ శ్రేణు లు పెద్ద ఎత్తున ఆర్జాలబావికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను తిప్పిపంపారు. అనంతరం ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై నల్లగొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కౌన్సిలర్ దంపతుల నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని షేక్ అన్వర్ పోలీసులను కోరారు.