హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 పరీక్షలో గణనీయమైన మార్పులు చేసింది. దేశంలోనే తొలిసారిగా సామాజికవర్గాల వారీగా మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసిన టీఎస్పీఎస్సీ పరీక్ష విధానంలో కూడా మార్పులు చేసింది. మారిన పరీక్ష విధానాన్ని బుధవారం వెల్లడించింది. మొదటిసారిగా గ్రూప్-1లో తప్పనిసరిగా రాయాల్సిన ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. మొత్తం ఆరు పేపర్లకు గాను ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున 900 మార్కులు ఇస్తారు. పేపర్-1లో జనరల్ ఎస్సే (వ్యాస రచన) ఉంటుంది. ఇందులో మూడు ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు మూడు చాయిస్లున్నాయి. అంటే మొత్తం తొమ్మిది ప్రశ్నలకుగాను మూడింటికి సమాధానం రాయాలి. ఒక్కో జనాబుకు 50 మార్కులు. మూడు జవాబులకు కలిపి 150 మార్కులు ఇస్తారు. ప్రతి వ్యాసం తప్పనిసరిగా 1000 పదాలకు తగ్గకుండా రాయాలి.
నాలుగు పేపర్లకు ఒకే విధానం
గ్రూప్-1 పరీక్షలో పేపర్-2, 3, 4, 6కు పరీక్ష విధానం ఒకేలా ఉన్నది. ఇందులోని ప్రతి పేపర్లో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో ఐదు ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో జవాబుకు 10 మార్కులు ఉంటాయి. ఇందులో, ప్రతి సెక్షన్లో మొదటి, రెండో ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలనే నిబంధన విధించారు. మూడు, నాలుగు, ఐదో ప్రశ్నలకు మాత్రం చాయిస్లిచ్చారు. అంటే ఆరు ప్రశ్నలు ఇచ్చి ఏవైనా మూడు ప్రశ్నలకు జవాబులు రాయాలని తెలిపారు. వీటితోపాటు ఇంగ్లిష్ క్వాలిఫయింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షకు 150 మార్కులు ఇస్తారు. ఇది టెన్త్క్లాస్ స్టాండర్డ్లో ఉంటుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. పేపర్-5 మిగిలిన పేపర్లకు భిన్నంగా ఉంటుం ది. సెక్షన్-3 డాటా ఇంటర్ప్రిటేషన్లో మొత్తం 30 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఇస్తారు. ప్రతి పరీక్షకు 3 గంటల సమయం ఉంటుంది.
మెయిన్స్కు 25,050 మంది అర్హత
గ్రూప్-1లో దేశంలోనే తొలిసారిగా సామాజిక న్యాయాన్ని అనుసరించి మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేశారు. ప్రతి సామాజిక వర్గం నుంచి 50 మందిని ఎంపిక చేశారు. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,150 మంది అర్హత సాధించాలి. అయితే.. మల్టీజోన్-2లో మహిళల క్యాటగిరీలో అంధత్వలోపం, జనరల్ క్యాటగిరీలో వినికిడిలోపం ఉన్న అభ్యర్థులు 111 మంది తక్కువగా ఉన్నా రు. దీంతో 25,050 మందిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది.
మెయిన్ పరీక్ష సిలబస్
పేపర్ -1 జనరల్ ఎస్సే – 3 గంటలు – 150 మారులు
1. సామాజిక సమస్యలు, అంశాలు
2. ఆర్థికాభివృద్ధి, న్యాయం
3. భారత రాజకీయాలు, మార్పులు
4. భారత చరిత్ర, సాంసృతిక వారసత్వం
5. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి
6. విద్య, మానవ వనరుల అభివృద్ధి
పేపర్ -2 చరిత్ర, సంసృతి, భౌగోళికశాస్త్రం – 3 గంటలు – 150 మారులు
1. 1757-1947 వరకు భారత దేశ చరిత్ర, సంస్కృతి
2. తెలంగాణ చరిత్ర, సాంసృతిక వారసత్వం
3. భారత దేశ, తెలంగాణ భౌగోళిక స్వరూపం
పేపర్ -3 – భారతదేశ సమాజం, రాజ్యాంగం, పరిపాలన – 3 గంటలు – 150 మారులు
1. భారత దేశ సమాజం, ఆకృతి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు
2. భారత రాజ్యాంగం
3. పరిపాలన
పేపర్ -4 – ఆర్థికశాస్త్రం, అభివృద్ధి – 3 గంటలు – 150 మారులు
1. భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి
3. పర్యావరణ సమస్యలు
పేపర్ -5 – సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్ – 3 గంటలు – 150 మారులు
1. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత, ప్రభావం
2. సైన్స్ విజ్ఞానంలో ఆధునికత వినియోగం
3. డాటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్
పేపర్ -6 – తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం – 3 గంటలు – 150 మారులు
1. తెలంగాణ ఆలోచన (1948-1970)
2. సమీకరణ దశ (1971-1990)
3. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991-2014)