హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో జరుగుతున్న 73వ రెగ్యులర్ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ల బేసిక్ శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్లో నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ) డైరెక్టర్ ఏఎస్ రాజన్ పాల్గొని గౌరవవందనం స్వీకరించారు.
మొత్తం 123 మంది ట్రైనీలు గల ఈ బ్యాచ్లో 25 మంది మహిళా అధికారులు ఉన్నారు. వీరికి శిక్షణలో భాగంగా ఔట్డోర్తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటియన్ పోలీస్, గ్రేహౌండ్స్, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, ఇండియన్ ఆర్మీ తదితర విభాగాలకు సంబంధించి తర్ఫీదు ఇచ్చారు.