హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో 19 నియోజకవర్గాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్థికమంత్రి హరీశ్రావు చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్దండాపూర్ వరకు ప్రధాన కన్వియన్స్ పనులను 2021-22లో, బ్రాంచి కాలువలు, ఇతర పనులను 2022-23 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
గోదావరి కరకట్టలకు కొత్తటెండర్లు
గోదావరి కరకట్టల నిర్మాణానికి సంబంధించి పాత అగ్రిమెంట్ రద్దుచేసి.. 14.60 కోట్లతో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు.