మానకొండూర్, నవంబర్ 13: మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్పై తప్పుడు ప్రచారం చేసిన డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మానకొండూర్ పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉన్నదని రిటర్నింగ్ అధికారికి ఉద్దేశ పూర్వకంగా ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో రసమయి నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించినట్టు ప్రచారం చేశాడని ఆయన పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించిన కవ్వంపల్లిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.