హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ):తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నాలుగు కారుణ్య నియామకాలను భర్తీ చేశారు. సోమవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ నలుగురికి నియామక పత్రాలను అందజేశారు. మన్నె స్వాతి, శివకుమార్, దివ్యతేజ, పవన్కుమార్లను శాశ్వత ఉద్యోగులుగా నియమించినట్టు వెల్లడించారు. మానవీయ కోణంలో కారుణ్య నియామకాల చేసిన సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్కు రాజీవ్సాగర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.