యాదాద్రి భువనగిరి/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తేతెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్పై విచారణ చేపట్టేందుకు ఆదివారం గురుకులాల సంయుక్త కార్యదర్శి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పెనేషియా ఓఎస్డీ ప్రశాంతి, విజిలెన్స్ అధికారి హుసేన్ తో కమిటీని నియమించినట్టు ఎస్సీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 12, 13 తేదీల్లో గురుకులంలో ఫుడ్పాయిజన్ వల్ల కొందరు విద్యార్థులు విరేచనాల తో అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను భువనగిరి ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అం దిస్తున్నారని పేర్కొన్నారు. ఆరోతరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు (ప్రశాంత్, కృష్ణ) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉప్పల్లోని మిరాకిల్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రశాంత్ ఆరో గ్య పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వైద్యుల సూచన మేరకు బంజారాహిల్స్ రెయిన్బో దవాఖానకు తరలించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విద్యార్థికి వెంటిలేటర్పై వైద్యం అందిస్తున్నారని, ఇద్దరికి ఉస్మానియా దవాఖానలో, మరో 11 మం దికి భువనగిరి ఏరియా దవాఖానలో వైద్యం చేస్తున్నారని, మిగిలిన వారి ఆరో గ్యం మెరుగుపడిందని వివరించారు.