నిజామాబాద్, మార్చి 13: పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్ పెంచాలని రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ విజ్ఞప్తి చేశారు. తక్కువ కూలి ఉండటంతో చాలామంది బీడీ కార్మికులు వృత్తి మానేస్తున్నారని, దీంతో ఉత్పత్తి తగ్గి టేకేదారులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బుధవారం నిజామాబాద్లో బీడీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అసోసియేషన్ ప్రధాన అధ్యక్షుడు ప్రకాశ్భాయ్ ఉపాధ్యాయ్కు మెమోరాండం అందజేశారు. టేకేదారుల కమీషన్, కనీస వేతనం పెంచాలని కోరారు. ప్రమాద బీమా కల్పించి ఆదుకోవాలని విన్నవించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దుంపల నారాయణ, మంచె నర్సింహులు, రచ్చ ఆంజనేయులు, క్యాస మల్లారెడ్డి, బొమ్మకంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.