జగిత్యాల అర్బన్, డిసెంబర్ 14: నకిలీ జీఎస్టీ ఖాతాలతో కోట్లల్లో లావాదేవీలు జరిపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం జగిత్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీ డియా సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్లు వేణుగోపాల్, బాలాజీ మాట్లాడారు.
జగిత్యాలకు చెందిన చందసా యి హైదరాబాద్లోని ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ వద్ద పనిచేస్తున్నాడని తెలిపారు. రద్దయిన సొసైటీల ఫోన్ నంబర్లు, మె యిల్ ఐడీలు మార్చి కోట్ల లావాదేవీ లు జరిపి జీఎస్టీ క్లెయిమ్ చేశాడని వివరించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జగిత్యాలలో సాయి ఇంట్లో సోదాలు జరిపామని, ప్రాథమికంగా 30 ఫేక్ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.