హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): పంటల నమోదును మరింత పక్కాగా చేసేందుకు వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్కు కలర్ మ్యాపింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం వినియోగిస్తున్న క్రాప్ బుకింగ్ యాప్లో మరిన్ని అప్షన్స్ను చేర్చింది. దీని ద్వారా ఒక సర్వే నంబరు భూమిలో సాగు చేసిన పంటలను మరింత కచ్చితత్తంతో నమోదు చేసేందుకు అవకాశం ఉంది. తాజా ఆప్షన్ ద్వారా క్రాప్ బుకింగ్లో నమోదు చేసిన పంట విస్తీర్ణానికి పలు రంగులతో మ్యాపింగ్ ఇవ్వనున్నారు. అంటే.. ఒక సర్వే నంబర్లో మొత్తం పంటలను యాప్లో నమోదు చేస్తే ఆ సర్వే నంబర్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అదే కొంత మేర సాగు చేస్తే చేయని భాగం పసుపు కలర్లో కనిపిస్తుంది. అదే విధంగా ఆ సర్వే నంబర్లో ఏ మాత్రం క్రాప్బుకింగ్ చేయని పక్షంలో అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. దీని ద్వారా ఏఈవోలకు ఏ సర్వే నంబర్లో క్రాప్ బుకింగ్ పూర్తయిందో, ఏ సర్వే నంబర్లో ఇంకా ఎంత మిగిలి ఉందో అనే అంశాలపై స్పష్టత ఉంటుంది. పంటల నమోదులో అమలు చేస్తున్న ఈ కొత్త విధానంపై ఏఈవోలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు తెలిపారు.