పరిగి, జూన్ 7: టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా ఆపదలో ఉన్న వారందరికీ సహాయం అందిస్తున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు చలిమిల ఆనందం ఇటీవల అనారోగ్యం కారణంగా దవాఖానలో చికిత్స పొందాడు.
ఇటీవల ఆయన సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా రూ.1.25 లక్షలు మంజూరైంది. ఈ మేరకు సదరు చెక్కును పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మంగళవారం ఆయనకు అందజేశారు.