హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు తదితరులు హాజరయ్యారు.
విద్యుత్తుశాఖపై సమీక్ష సమావేశానికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని, అధికారికంగా పిలుపు అందలేదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు మీడియాకు తెలిపారు. సమీక్షకు ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం రాలేదని, సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానని ఎదురు ప్రశ్నించారు. విద్యుత్తుశాఖ నుంచి కానీ.. సీఎంవో నుంచి కానీ తనకు ఎలాంటి పిలుపు రాలేదని ప్రభాకర్రావు స్పష్టం చేశారు.