CM Revath Reddy | ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయాత్రం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలపై ఆరా తీశారు.
ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను పరిశీలించారు. సీఎం వెంట మంత్రి సీతక్క ఉన్నారు. అంతకు ముందు ఎంసీహెచ్ఆర్డీఐకి వచ్చిన సీఎంకు డీజీ శశాంక్ గోయల్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం సంస్థ కార్యకలాపాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో సంస్థ ఏడీజీ బెన్హర్ మహేశ్ దత్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.