హైదరాబాద్ ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ విషయంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసుల విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. ఇక ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని, పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. సచివాలయంలో ప్రెస్మీట్ అనంతరం సోమవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యారు. 22-ఎ ద్వారా ఎదురవుతున్న సమస్యలు.. పరిష్కారం, జీవో 97, విద్యార్థుల ఆందోళనలు, ‘సర్’ తదితర అంశాలను సైతం ప్రస్తావించినట్టు సమాచారం. సెప్టెంబర్ 7నుంచి నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, ఏవిధంగా సమాధానం ఇవ్వాలనే అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.