హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సామాజిక ఉద్యమకారుడు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషిచేస్తున్నారని పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల సాధికారత, మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. ఫూలే జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.