హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం తెచ్చిన సాగుచట్టాల రద్దుకు ఆనాడు చేపట్టిన ఉద్యమంలో మరణించిన పంజాబ్ రైతుల బాధిత కుటుంబాలకు తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆర్థికసాయం కింద చెక్కులు పంపిణీ చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత “కేంద్ర మంత్రి కొడుకు రైతులను జీపుతో తొక్కించి చంపినా స్పందించని సంస్కృతి బీజేపీది.. దేశానికి వెన్నెముక అయిన రైతును కడుపులో పెట్టి చూసుకునే సంస్కృతి ముఖ్యమంత్రి కేసీఆర్ది.. కేసీఆర్ ఫర్ ఫార్మర్స్” అని ట్వీట్ చేశారు.