సిద్దిపేట : రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్రెడ్డితో కలిసి బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్లో లక్షా 80 వేల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమైక్య రాష్ట్రంలో కులవృత్తుల నిరాధరణతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వoసం అయిందన్నారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం రూ.115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలను, 25 కోట్ల రొయ్య పిల్లలను జల వనరుల లో విడుదల చేస్తున్నాం.
సిద్దిపేట జిల్లాలో రూ.4 కోట్ల 87 లక్షల రూపాయలతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని వివరించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారని ప్రశంసించారు.
మత్స్య కారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో ప్రతి చెరువులో చేప పిల్లల విడుదల చేయాలన్నారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలి.
విడుదల ప్రక్రియ ఆద్యాంతం వీడియో గ్రఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు, తోటపల్లి జలాశయంతో 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తలసాని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గర్భశోకం మిగిల్చిన రోజే.. కవలలకు జన్మ
CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
లీడింగ్లో పుతిన్ పార్టీ.. కొన్ని చోట్ల కమ్యూనిస్టుల హవా