హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేడు మేడారంలో పర్యటించనున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మూడో రోజుకు చేరుకున్నది. గద్దెల వద్దకు దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం వరకు గిరిజన జాతర కొనసాగనుంది. రేపు సమ్మక్క సారలమ్మ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది.