మహబూబ్నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు పర్యటనకు రానున్నారు. ఆయన రోడ్డు మార్గంలో మహబూబ్నగర్కు భారీ కాన్వాయ్తో చేరుకోనున్నారు. ముందుగా మహబూబ్నగర్లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, పాలకొండ వద్ద నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం పర్యవేక్షించారు.