హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఆదిమానవుని కాలం నుంచి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల వారసత్వ సంపద తెలంగాణ సొంతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని స్మరించుకోవాలని ఆయన సోమవారం పిలపునిచ్చారు. శాతవాహన వంశం నుంచి అసఫ్జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేసిందని పేరొన్నారు. ఇకడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంసృతి సంప్రదాయాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని తెలిపారు.
జైన, బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గో లొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్ చర్చి, మకా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం కేసీఆర్ పేరొన్నారు.
స్వరాష్ట్రంలో వారసత్వ సంపదల పరిరక్షణలో భాగంగా ఖిలా వరంగల్ కోట ఆధునీకరణ, చార్మినార్, మకా మసీదు మరమ్మతులు, మొజంజాహి, మోం డా మారెట్ అభివృద్ధి, మరెన్నో కట్టడాలకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. 300 ఏండ్ల ప్రాచీనమైన బన్సీలాల్ పేట మెట్ల బావిని పునరుద్ధరించినట్టు తెలిపారు.