నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని పోరాట ఫలితమే కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను నెరవేర్చిందన్నారు.