హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రగతి భవన్లో దసరా పూజల అనంతరం కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఇతర నేతలతో కలిసి భారీ కాన్వాయ్తో కేసీఆర్ పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక కేసీఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించబోతుండటంతో.. దేశమంతా తెలంగాణవైపే చూస్తోంది.